News May 16, 2024
తెనాలి: తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె

తల్లి ఇంటికి కుమార్తె నిప్పు పెట్టింది. పోలీసులు ఏమన్నారంటే.. తెనాలిలోని చెంచుపేటలో రోశమ్మ పూరింట్లో నివాసం ఉంటోంది. ఆమె కూతురు సుజాతకు వివాహం కాగా, భర్తకు దూరమై మరో వ్యక్తితో ఉంటోంది. రోశమ్మ ఇద్దరు మనవరాళ్లను(12,14 ఏళ్లు) తన వద్దే ఉంచుకొని పెంచుతోంది. కూతుళ్లను తల్లి తన వద్దకు పంపట్లేదనే కోపంతో సుజాత తల్లి ఇంటికి నిప్పు పెట్టింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 23, 2025
గుంటూరు: టెన్త్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

గుంటూరు జిల్లాలో 30,410 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 29,459 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాగా, 2024లో పరీక్షలు తప్పినవారు, ప్రవేట్గా రాస్తున్న వారు 961 మంది ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు SSC పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు పరీక్షల విభాగ డైరెక్టర్ KV శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వే2న్యూస్ ద్వారా వేగంగా పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు.
News April 22, 2025
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం

మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) డీపీఆర్ తయారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ పని కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి మే 14లోగా ఆర్ఎఫ్పీలు (ప్రతిపాదనలు) కోరుతూ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం నిర్మాణంతో పాటు అక్కడి ప్రధాన రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ డిజైన్కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.
News April 22, 2025
పెదకూరపాడు: సివిల్స్లో సత్తా చాటిన రైతు బిడ్డ

పెదకూరపాడుకు చెందిన సామాన్య రైతు బిడ్డ చల్లా పవన్ కళ్యాణ్ సివిల్స్లో 146వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించాడు. పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించినట్లు పవన్ తెలిపాడు. పవన్ విజయం జిల్లాకే గర్వకారణమని స్థానికులు కొనియాడారు. మంచి ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.