News October 9, 2025
తెనాలి: ‘మావు’లకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు.!

కాలువల్లో చేపల వేటకు ఉపయోగించే వెదురు ‘చేపల మావుల’ తయారీలో తెనాలి సమీప ఆలపాడు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి చేపల మావులు అనగానే ముందుగా గుర్తొచ్చేది చుండూరు మండలం ఆలపాడు గ్రామమే. నాణ్యమైన మన్నికైన చేపల మావులు కోసం అనేక మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకు వెళుతుంటారు. ఇక్కడ చాలా కుటుంబాలు వ్యవసాయ పనులతో పాటు వీటి తయారీ వృత్తిపైనే ఆధారపడ్డాయి.
Similar News
News October 9, 2025
GNT: అక్రమ విద్యుత్ కనెక్షన్లకు అపరాధ రుసుం

నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వినియోగిస్తున్న 53 కనెక్షన్లకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 4.86 లక్షల అపరాధ రుసుం విధించారు. విద్యుత్ శాఖలోని విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా గురువారం చమల్లమూడి, కాట్రపాడు, ముట్లూరు, పల్లాడు, సౌపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో 1,965 సర్వీసులను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వాడుతున్న కనెక్షన్లను గుర్తించి, వాటికి జరిమానా విధించారు.
News October 9, 2025
పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి: సీఎస్

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుంచి పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎస్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇ-పంటలో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
News October 9, 2025
ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి: జేసీ

GNT జిల్లాలో ధాన్యం సేకరణపై నేడు కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో JC ఆశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధరను సాధారణ రకం క్వింటాలుకు రూ. 2,369/గా, ‘A’ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ. 2,389/గా నిర్ణయించామన్నారు.