News February 16, 2025
తెనాలి: రైలు ఢీకొని మహిళ దుర్మరణం

తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. పట్టాలు దాటుతుండగా కొలకలూరుకు చెందిన పద్మావతి(55) అనే మహిళను సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లే ప్యాసింజర్ ఎక్కేందుకు వచ్చిన పద్మావతి స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News January 27, 2026
తెనాలిలో దారుణం.. భార్యను చంపి భర్త పరార్

తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం చోటు చేసుకుంది. డిపో రోడ్డుకు చెందిన శిరీష (26)ను భర్త సాయి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. భార్యపై అనుమానంతో కొద్ది రోజులుగా ఘర్షణ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గొడవ జరగడంతో ఆమెను గొంతు నులిమి పరారయ్యాడు. స్థానికులు వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News January 27, 2026
సచివాలయ సీఎస్ఓకు ఇండియన్ పోలీస్ మెడల్

ఏపీ సచివాలయ సీఎస్ఓ పి.వి.ఎస్.ఎన్.మల్లికార్జునరావుకు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (MSM) లభించింది. 36 ఏళ్ల క్రమశిక్షణాయుత సేవలకు గుర్తింపుగా, గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన మల్లికార్జునరావు గతంలో ఐటీబీపీ, ఏపీఎస్పీఎఫ్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఎఫ్ అధికారులు ఆయన్ను అభినందించారు.
News January 27, 2026
రాజధాని రైతులకు 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 29న ప్లాట్ల కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఇ- లాటరీ ద్వారా ప్లాట్లను నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


