News July 9, 2025

తెలంగాణకు యూరియా కోత.. కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ

image

తెలంగాణకు యూరియా కేటాయింపులు 45% తగ్గించడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. రాజకీయ ప్రేరణతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధికంగా యూరియాను సరఫరా చేసి, తెలంగాణను ఉపేక్షించడం అన్యాయమన్నారు. RFCLలో తయారైన యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

Similar News

News July 9, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక సమ్మె
> ఆకట్టుకున్న బాంజీపేట ప్రభుత్వ పాఠశాల
> జనగామ డీటీఓగా హుస్సేన్ బాధ్యతల స్వీకరణ
> రఘునాథపల్లి: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
> పాలకుర్తి ఎంపీడీవోగా రవీందర్ బాధ్యతల స్వీకరణ
> ఇప్పగూడెం జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
> బతుకమ్మ కుంట నెల రోజులు మూసివేత
> జనగామ ఎమ్మెల్యేను పరామర్శించిన ఎంపీ

News July 9, 2025

మైనింగ్ బ్లాక్‌పై ఫిర్యాదులు.. స్పందించిన పవన్

image

AP: విజయనగరంలో దేవాడ మైనింగ్ బ్లాక్‌ విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను పరిగణించలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఆ జిల్లా అధికారులతో పవన్ చర్చించారు. మైనింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

News July 9, 2025

నల్గొండ: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య

image

కనగల్‌కి చెందిన కౌలు రైతు గోనెల చిన్న యాదయ్య (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఎస్.రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటంతో ఇవాళ మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.