News March 28, 2024
తెలంగాణలో తూ.గో జిల్లావాసి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711581110398-normal-WIFI.webp)
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో సామర్లకోటకు చెందిన కొరిపల్లి సంజయ్ (26) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై యాదగిరి బుధవారం తెలిపారు. ఇతను సంజయ్ దివిస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని చెప్పారు. పరిశ్రమ క్వార్టర్స్ లో ఉండే అతను నెల రోజుల క్రితం స్నేహితులు అద్దెకు ఉండే గదికి మారాడన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.
Similar News
News July 8, 2024
గత ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపించింది: MP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720439641578-normal-WIFI.webp)
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపించిందని రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. NDA ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. వీరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా NDA ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందని తెలిపారు.
News July 8, 2024
ఎమర్జెన్సీని తలపించిన YCP పాలన: పురందీశ్వరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720427536447-normal-WIFI.webp)
ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలన ఎమర్జెన్సీ కాలంనాటి రోజులను తలపించిందని బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించే ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని పురందీశ్వరి అన్నారు.
News July 8, 2024
పవన్ కళ్యాణ్కు మాటిచ్చి.. రంగంలోకి కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720419096713-normal-WIFI.webp)
సమస్యల పరిష్కారం నిమిత్తం 2 వారాలకొకసారి కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ స్వయంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని ముందుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభా వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్కు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ షాన్మోహన్ సోమవారం పిఠాపురం విచ్చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.