News March 21, 2025

తెలంగాణ ఊటీ.. అనంతగిరి అందాలను కాపాడుకుందాం

image

VKBకు 6 కి.మీ. దూరంలో ఉన్న ‘అనంతగిరి కొండలు’ ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో అటవీ అబ్బుర పరుస్తోంది. అటవీ మధ్య 1300 ఏళ్ల చరిత్ర గల ‘అనంత పద్మనాభస్వామి ఆలయం’ అందరినీ ఆకర్షిస్తోంది. అనంతగిరిని ‘తెలంగాణ ఊటీ’ అంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువ. ప్రస్తుతం ఈ అటవీలో చాలా చెట్లు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకుంటే మరిన్ని అందాలను అనంతగిరి ప్రజలకు పంచుతుంది.

Similar News

News July 5, 2025

విజయవాడలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

image

విజయవాడలో రూ.20.31 కోట్లతో 84 అభివృద్ధి పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ (వీఎంసీ) టెండర్లు ఆహ్వానించింది. డ్రైన్లు, రహదారులు, కల్వర్టులు, నీటి సరఫరా మరమ్మతులే లక్ష్యమని కమిషనర్ హెచ్‌ఎం. ధ్యానచంద్ర తెలిపారు. ఆసక్తిగల గుత్తేదారులు వివరాల కోసం https://apeprocurement.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News July 5, 2025

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ బదిలీ

image

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ ఆకస్మిక బదిలీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల నిర్వహణతో పాటు రెవెన్యూ సదస్సుల విజయవంతంలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని (PRRD) విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News July 5, 2025

నిజామాబాద్: రేషన్ బియ్యానికి 48,978 మంది దూరం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 6,60,241 రేషన్ కార్డులు ఉండగా 6,11,263 మంది బియ్యం తీసుకున్నారు. 48,978 మంది రేషన్ తీసుకోలేదు. కాగా మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.