News March 5, 2025
తెలంగాణ సచివాలయం ముందు కూల్ ఐడియా

పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సచివాలయం వద్ద అధికారులు కూల్ ఐడియా అమలు చేశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులు, అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నంబర్-2 వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
Similar News
News November 14, 2025
BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: ఎవరు గెలిచినా విజయోత్సవాలకు నో పర్మిషన్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుండగా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కాగా ఈ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా విజయోత్సవాలకు పర్మిషన్ లేదని అధికారులు స్పష్టం చేశారు.
News November 14, 2025
జూబ్లీ బైపోల్: కౌంటింగ్ హాల్లోకి వీరికి మాత్రమే అనుమతి

యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు అవుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ హాల్కు చేరుకున్నారు. అయితే, కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు.
SHARE IT


