News February 3, 2026
తెలుగువారి 52 ఏళ్ల ట్రైన్.. అరుదైన అవార్డు

హైదరాబాద్-విశాఖ మధ్య 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్కు అరుదైన గౌరవం దక్కింది. 2025కు గాను బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు లభించింది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని SCR ట్వీట్ చేసింది. ఈ రైలుతో మీకున్న అనుబంధంపై కామెంట్ చేయండి.
Similar News
News February 22, 2026
తగ్గనున్న వంటనూనె ధరలు?

వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్స్పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10% తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల మొత్తం సుంకం 27.5% నుంచి 16.5% పడిపోతుంది. భారత్ తన వంటనూనెల అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ నూనెపై ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
News February 22, 2026
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News February 22, 2026
కర్ణాటకలో పవర్ షేరింగ్పై త్వరలో కీలక ప్రకటన!

కర్ణాటకలో CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్ మధ్య సాగుతున్న అధికార పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ముగింపు పలకనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సతీశ్ జార్కీహోళీ తెలిపారు. పవర్ షేరింగ్పై హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అనంతరం ఆయన వెల్లడించారు. సిద్దరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో అధికారాన్ని తనకు అప్పగించాలని శివకుమార్ కోరుతున్న విషయం తెలిసిందే.


