News February 11, 2026

తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

image

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

Similar News

News February 13, 2026

MBNR: 41 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు!

image

మహబూబ్ నగర్ జిల్లాలోని 81 డివిజన్ల మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు 41 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కోసం 30, దేవరకద్రకు 6, భూత్పూర్ మున్సిపాలిటీకి 5 టేబుళ్లను కేటాయించారు. మొత్తం 185 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.

News February 13, 2026

HYDలో ఎయిర్ క్వాలిటీ @194

image

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున టీచర్స్ కాలనీలో 194గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 13, 2026

ఎవరీ కందుల జాహ్నవి?

image

సియాటెల్ యంత్రాంగం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించడంతో <<19125504>>కందుల జాహ్నవి<<>> మరోసారి వార్తల్లో నిలిచారు. 2023లో అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని మృతిచెందిన జాహ్నవిది కర్నూలు(D) కౌతాళం మం. కుంభళనూరు క్యాంప్‌ గ్రామం. శ్రీకాంత్‌, విజయలక్ష్మిల కుమార్తె జాహ్నవి ఆదోనిలో డిగ్రీ వరకు చదివారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పోలీసు వాహనం ఢీకొని మృతిచెందారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు 3ఏళ్లు న్యాయపోరాటం సాగించి గెలిచారు.