News December 23, 2025
‘తెల్లబర్లీ పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం బాధ్యత వహించదు’

AP: రాష్ట్రంలో తెల్ల బర్లీ పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదని వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ పొగాకు సాగుకు కంపెనీలతో కొనుగోలు అగ్రిమెంట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతులు తెల్లబర్లీ సాగుచేస్తే కంపెనీల నుంచి 100% కొనుగోలు అగ్రిమెంట్లు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అనధికారికంగా నల్లబర్లీ పొగాకు సాగును టాస్క్ఫోర్స్ బృందాలు కట్టడి చేయాలని సూచించారు.
Similar News
News February 22, 2026
ధన్వంతరి మంత్రం ఎందుకు పఠించాలి?

ధన్వంతరిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తారు. ఆయుర్వేద అధిదేవత, దేవవైద్యుడు కూడా ఆయనే. అయితే ఆయన పేరుమీద ఉన్న ధన్వంతరీ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారికి భవిష్యత్తులో రోగాలు వ్యాపించకుండా కాపాడుతుందని అంటున్నారు.
మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ! ధన్వంతరయే అమృత కలశ హస్తాయ| సర్వమయ వినాశాయ త్రైలోక్య నాథాయ| ధన్వంతరి మహావిష్ణవే నమః|
News February 22, 2026
933పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2026కు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఏడాది ఆలిండియా సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి(రిజర్వేషన్ గలవారికి సడలింపు). ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ మే 24న నిర్వహిస్తారు. సైట్: https://upsc.gov.in
News February 22, 2026
పగలు ఎండ, రాత్రి ఠండా.. మధ్యలో వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాత్రిళ్లు చలిగాలులు వీస్తుండగా పగలు ఎండ దంచి కొడుతోంది. ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీలోని నందిగామ, కర్నూలులో నిన్న 37డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండ వేడికి ఉక్కపోత మొదలైంది. ఇక వేసవి పూర్తిగా రాకముందే వర్షాలు ఎంటరవుతున్నాయి. అల్పపీడనం వల్ల నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.


