News April 26, 2024
తొండంగి: ఉరేసుకుని ఇస్రో ఉద్యోగి ఆత్మహత్య

తొండంగి మండలం పైడి కొండకు చెందిన కోదండ గంగేశ్వర్ (31) ఉరి వేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో గంగేశ్వర్ టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తూ డిప్యూటేషన్పై సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో ఎస్పీబీలో విధులు నిర్వహిస్తున్నాడు. సూళ్లూరుపేట షార్ ఉద్యోగుల నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News April 21, 2025
తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.
News April 21, 2025
తూ.గో: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
News April 21, 2025
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యలు పరిష్కారo కోసం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రంలో ఉదయం 10 నుంచి మ.1గంట వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రత్యేక అధికారులు, జిల్లా, డివిజన్ మండల, మున్సిపల్ క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు.