News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News February 28, 2026
కామారెడ్డి: ఉపాధి కూలీలతో కలిసి కాంగ్రెస్ నేతల పని

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగఠన్ సృజన్ అభియాన్ 8వ రోజు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా మదనపల్లిలో శనివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. మన్రేగా (ఉపాధి హామీ) పథక పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో కలిసి పని చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
News February 28, 2026
సూర్యాపేటలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లాలో మార్చి 1 నుంచి నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందనీ ఎస్పీ నరసింహ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. బాణాసంచా, DJలు నిషేధం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు.
News February 28, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారా?

US, Israel దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీనిని ఇరాన్ వర్గాలు ఖండించాయి. తనకు తెలిసినంత వరకు ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ తెలిపారు. కాగా ఖమేనీ పరిస్థితిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు Israel దాడుల్లో ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నాసీర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి.


