News June 25, 2024
తొర్రూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719285931817-normal-WIFI.webp)
తొర్రూరు డివిజన్ పరిధిలోని మడిపల్లి శివారులోని అకేరు వాగు సమీపంలో తొర్రూరు-నెల్లికుదురు రోడ్డు పై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తొర్రూరులోని అమృత బ్రెడ్ ట్రాన్స్ పోర్ట్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మృతుడు చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమండ్ల సుధాకర్ రెడ్డిగా గుర్తించారు.
Similar News
News June 29, 2024
జనగామ: మహిళల జీవనోపాధికి కృషి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719594424463-normal-WIFI.webp)
జనగామ జిల్లాను ఆదర్శవంతమైన మహిళా శక్తి దిశగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేటులో మండలాల సీసీలు, ఏపీఎంలు, వీవోలకు మహిళా శక్తి పథకంపై కలెక్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి కల్పించాలని వారిని మరింత ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు.
News June 29, 2024
మావోయిస్టుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719581794205-normal-WIFI.webp)
మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దులోని పోలీసులు.. మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మావోల ప్రాబల్యం ఉన్నందున, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News June 28, 2024
వరంగల్: వంగర పర్యాటకం కలేనా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719594657435-normal-WIFI.webp)
దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగర పర్యాటకాభివృద్ధి కలగానే మిగిలింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా 2020లో మాజీ సీఎం కేసీఆర్ వంగర గ్రామంలో పీవీ జ్ఞాన వేదిక స్మృతివనం ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేసినా పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. శుక్రవారం పీవీ 103వ జయంతి సందర్భంగా పనుల నత్తనడకపై గ్రామస్థులు విమర్శలు చేస్తున్నారు.