News June 10, 2024
తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్
కరీంనగర్ MPగా రెండవసారి గెలిచిన బండి సంజయ్ను కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బండి.. 2019లో KNR పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, ఏడాదిలోపే రాష్ట్ర BJP అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై.. 2024లో అదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సాధించారు.
Similar News
News October 3, 2024
కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.
News October 3, 2024
KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
News October 3, 2024
ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.