News September 20, 2024

త్రిసభ్య కమిటీలో కోరుట్ల ఎమ్మెల్యేకు చోటు

image

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపైన స్టడీ చేయడానికి త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అధ్యక్షతన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందించనుంది.

Similar News

News October 2, 2024

రాహుల్ గాంధీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

image

హైడ్రా విషయంలో రాహుల్ గాంధీపై సిరిసిల్ల MLA కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్ట్‌ను రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతి ఇచ్చాడని బుధవారం విలేకరుల చిట్ చాట్‌లో ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ హైడ్రాను నడిపిస్తున్నాడన్నారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తుండని స్పష్టం చేశారు.

News October 2, 2024

HSBD: బాపు షూట్‌లో గాంధీ జయంతి వేడుకలు

image

భారత జాతిపిత మాత్మ గాంధీ జయంతి వేడుకలను లాంగర్ హౌస్‌లోని బాబు షూట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహాత్ముడికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సత్యం అహింస శాస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు అని అన్నారు.

News October 2, 2024

KNR: ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మ

image

బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఒక్కోరోజు ఒక్కో రూపంలో మహిళలు పూలతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగింపు.