News January 25, 2025
త్వరలోనే YCPకి జగన్ గుడ్బై: కిరణ్ రాయల్

YCP అధినేత జగన్ ఓ మూర్ఖుడని, త్వరలోనే ఆయన పార్టీని వదిలి లండన్ వెళ్తారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఆ పార్టీలో ముఖ్య నాయకులంతా ఇప్పటికే పార్టీకి గుడ్బై చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి లక్షల కోట్లు దోచుకుంటే, జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. త్వరలోనే YCP ఆఫీసుల వద్ద టూ లెట్ బోర్డులు కనిపిస్తాయన్నారు. VSR కూటమిలో చేరే ప్రయత్నం విఫలం కావడంతోనే YCPకి గుడుబై చెప్పారన్నారు.
Similar News
News November 8, 2025
బుమ్రా కాదు.. వాళ్లిద్దరే డేంజర్: అశ్విన్

టీ20 ఫార్మాట్లో బుమ్రా కన్నా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ప్రమాదమని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్లో జరగబోయే T20 WCను గెలవాలనుకుంటే వాళ్లు చక్రవర్తి, అభిషేక్ శర్మ రూపంలోని అడ్డంకులను దాటాల్సిందే. వీరి కోసం ప్రత్యేక వ్యూహాలు రెడీ చేసుకుంటేనే ప్రత్యర్థులు గెలవగలరు. ఆసీస్ అభిషేక్ కోసం వాడుతున్న షార్ట్ బాల్ స్ట్రాటజీ బాగుంది. WCలోనూ వాళ్లు ఇదే వాడొచ్చు’ అని తెలిపారు.
News November 8, 2025
రామారెడ్డి: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాలిలా..రామారెడ్డి (M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ. 1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోస పోయినట్లు తెలిసి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.
News November 8, 2025
అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.


