News December 28, 2025
త్వరలో కరెంట్ బిల్లులు తగ్గే ఛాన్స్!

విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్లు వసూలు చేసే ఛార్జీలపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమీక్షిస్తోంది. 2026లో అమలులోకి వస్తున్న మార్కెట్ కప్లింగ్ విధానంతో అన్ని ఎక్స్ఛేంజీలు ఒకే రేట్ వసూలు చేయాలి. ప్రస్తుతం యూనిట్కు 2పైసలుగా ఉన్న ట్రాన్సాక్షన్ ఫీజును 1.5/1.25పైసలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో డిస్కంలు తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేస్తే సామాన్యులకు కరెంట్ బిల్ తగ్గుతుంది.
Similar News
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి: పురాణ గాథ ఇదే..

పూర్వం మధుకైటభులు అనే రాక్షసులను విష్ణువు సంహరించినప్పుడు వారు వైకుంఠ ద్వారం వద్ద స్వామిని దర్శించుకుని శాపవిమోచనం పొందారు. ఈ పవిత్ర దినాన తమలాగే ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షం ప్రసాదించాలని వారు కోరుకున్నారు. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాధాన్యత. తనను కొలిచే భక్తులను అనుగ్రహించడానికి శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భువికి చేరుకుంటారట.
News December 30, 2025
ధనుర్మాసం: పదిహేనో రోజు కీర్తన

నిద్రిస్తున్న ఓ గోపికను మేల్కొల్పే క్రమంలో ఆమెకు, గోపికలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. బయట వారు ‘లేత చిలుకా! ఇంకా నిద్రనా?’ అని ఆటపట్టిస్తే, ఆమె లోపలి నుంచే ‘నేను వస్తున్నా, అంత గొంతు చించుకోకండి’ అని బదులిస్తుంది. ‘నీ మాటకారితనం మాకు తెలుసు’ అని వారు గేలి చేస్తే, ఆమె వినమ్రంగా జవాబిస్తుంది. చివరకు కంసుడిని, కువలయాపీడమనే ఏనుగును సంహరించిన కృష్ణుడి గుణగానం చేయడానికి అందరూ కలిసి వెళ్తారు. <<-se>>#DHANURMASAM<<>>
News December 30, 2025
హమాస్కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.


