News August 3, 2024

త్వరలో సాలూరు-విశాఖకు రైలు సేవలు

image

సాలూరు-విశాఖ రైలు బస్సు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖ-విజయనగరం మధ్య నడుస్తున్న రైలును వీలైనంత త్వరగా సాలూరు వరకు పొడిగించాలని రైల్వే డీఆర్ఎం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్యానికి ముందు సాలూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయగా నష్టాల పేరిట 2000లో మూతబడింది. 2004లో రైలు సేవలు అందుబాటులోకి రాగా.. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయాయి.

Similar News

News May 7, 2025

ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

image

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.

News May 7, 2025

అంతర్ జిల్లాల బదిలీలు చేయాలి: ఏపీటీఎఫ్

image

ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాచలం, బి.జోగినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేసి స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్లను పరిగణించాలన్నారు. 1998/2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలు కూడా రెగ్యులర్ టీచర్లతో చేయాలన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలకు రెండో టీచర్‌ను నియమించాలన్నారు.

News May 7, 2025

భోగాపురం మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్

image

భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.