News June 27, 2024

థాంక్స్ మోదీ సార్: ఎంపీ బైరెడ్డి శబరి

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలతో బుధవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో కీలక సూచనలు, సలహాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. ‘మీ విలువైన సమయం మాకు కేటాయించి కీలక సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మోదీ సార్’ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో తాము భాగస్వామ్యం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News July 1, 2024

బనగానపల్లె: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి

image

బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటలోని ఇంటింటికీ సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ రూ.4000 అలాగే 3 నెలల పెంపు రూ.3000 కలిపి ఒకేసారి రూ.7000 పింఛన్ లబ్ధిదారులకు బి.సి.జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు.

News July 1, 2024

ఆదోని: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుడ్లూరులో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న బసవరాజు(22)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. 2 నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

News July 1, 2024

కర్నూలు: నేటి నుంచి బియ్యం, జొన్నల పంపిణీ

image

నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గోదాముల్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు సరకుల నాణ్యత పరిశీలించి నివేదికలు ఇవ్వనున్నారని JC నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై నెలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేయాలని ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. కార్డుదారులు 3 కిలోల వరకు జొన్నలను బియ్యానికి బదులుగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.