News October 20, 2025

దగడలో అత్యధిక వర్షపాతం

image

వనపర్తి జిల్లాలోని 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు కేవలం రెండు కేంద్రాలలోనే వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దగడలో 3.0 మిల్లీమీటర్లు, శ్రీరంగాపురంలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మిగిలిన 19 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Similar News

News October 20, 2025

రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 20, 2025

భీమవరం: ఈనెల 23న ఎంపీడీఓ కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్

image

AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 86885 94244 ఈ నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News October 20, 2025

ఆకాశంలో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు

image

NTR (D) వీరులపాడు (M) రంగాపురం శివారులో ఆకాశంలో ఇంద్ర ధనస్సు కనువిందు చేసింది. గ్రామంలో సాధారణ నుంచి మోస్తరు చిరుజల్లులు ప్రారంభమయ్యాయని, ఆ సమయంలో ఏర్పడిన ఇంద్ర ధనస్సు చూపరులను ఆకట్టుకుందని స్థానికులు తెలిపారు. గ్రామానికి దగ్గరలోని అటవీ ప్రాంతం ఉండడంతో కొండ ప్రాంతం సైతం పచ్చటి వాతావరణం నెలకొందని స్థానికులు అన్నారు.