News June 11, 2024

దగదర్తిలో విమానం దిగేనా ! 

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణం పదేళ్లుగా హామీగా మిగిలిపోయింది. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ హయాంలోనూ పనులు చేపట్టలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీ ఎంపీ రాంమోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కావడంతో దగదర్తి ఎయిర్ పోర్టు కల సాకారం కావాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

Similar News

News September 13, 2025

ఉలవపాడు: జ్యువెలరీ షాప్ సిబ్బందిని బురిడి కొట్టించిన కిలా(లే)డీలు

image

ఉలవపాడులోని ఓ జ్యువెలరీ షాప్‌లో శుక్రవారం 4 జతల బంగారు కమ్మలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. బంగారు కమ్మలు కొనడానికి వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు షాపు సిబ్బందిని బురిడి కొట్టించి 4 జతల గోల్డ్ కమ్మలు మాయం చేశారు. ఆ తర్వాత గుర్తించిన షాపు సిబ్బంది రూ.లక్ష విలువైన సొత్తు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI అంకమ్మ తెలిపారు.

News September 12, 2025

ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

image

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.

News September 12, 2025

నత్తనడకన రామాయపట్నం పోర్టు పనులు!

image

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.