News September 17, 2025
దత్తతతో దేశం దాటి.. మూలాల కోసం మళ్లీ వచ్చింది..!

దత్తతతో దేశం దాటిన మహిళ తన తల్లిదండ్రుల మూలాల కోసం మళ్లీ తిరిగి మాతృ దేశానికి వచ్చింది. వరంగల్ శివనగర్లో తన మూలాలు ఉన్నాయని గుర్తించి చివరకు తన తల్లిదండ్రులను కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 36 ఏళ్ల క్రితం సంధ్యారాణి అనే మహిళ దత్తతతో స్వీడన్ దేశానికి వెళ్లింది. పెరిగి పెద్దై ఉన్నత చదువుల్లో రాణించి 2009 నుంచి అన్వేషించింది. చివరకు తనది పద్మశాలి సామాజిక వర్గమని తెలుసుకుంది.
Similar News
News September 17, 2025
సిరిసిల్ల: సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1930లో కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్ర నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో అరెస్టు అయి మూడేళ్లు జైలులో ఉన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన ఈ యోధుడు 1978 డిసెంబర్ 27న మరణించారు.
News September 17, 2025
24న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉదయం 10గంటలకు విడుదల కానున్నాయి. మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మవద్దని, <
News September 17, 2025
సిరిసిల్ల : తొలితరం పోరాట యోధుడు రావుల నరసింహ రెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన తొలితరం యోధుడు రావుల నరసింహ రెడ్డి. రాజన్న సిరిసిల్లి జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఈయన 1949 ప్రాంతంలో ప్రజల కష్టాలను చూసి పోరాటంలో భాగమయ్యారు. పేదల కోసం అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆయనను ఒక గొప్ప వీరుడిగా గుర్తుంచుకుంటారు.