News July 18, 2024

దమ్మపేట: పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి

image

పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. దమ్మపేట మండలం జమేధారు బంజర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News August 31, 2024

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, కావున అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

News August 31, 2024

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు PINK ALERT⚠️

image

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News August 31, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆}మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటర్ సర్వే
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం