News January 24, 2025
దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను జనగామ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ పరిశీలించారు. శుక్రవారం స్టే.ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆన్లైన్ ప్రక్రియన పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని గ్రామాల దరఖాస్తులను ఆన్ లైన్ చేశారు, ఇంకెన్ని గ్రామాలు చేయాలని అడిగి తెలుసుకున్నారు.ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా ఆన్లైన్ చేయాలని, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన సూచించారు.
Similar News
News February 15, 2026
రాజన్న సన్నిధిలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ కౌంటర్లను పరిశీలించి, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News February 15, 2026
ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. PTI ఆందోళన

అవినీతి కేసుల్లో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<19124142>>తీవ్ర అనారోగ్యంతో<<>> బాధపడుతున్నట్లు PTI పార్టీ తెలిపింది. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇది ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆరోపించింది. ఆయన ఫ్యామిలీ మెంబర్, పర్సనల్ డాక్టర్ల సమక్షంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.
News February 15, 2026
రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు: అనకాపల్లి కలెక్టర్

మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 16వ తేదీన నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఐచ్ఛిక సెలవు దినం ప్రకటించడంతో కలెక్టరేట్తో పాటు మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.


