News November 17, 2024

దశాబ్దం తరువాత రాష్ట్రంలో ప్రజాపాలన: మంత్రి పొన్నం

image

దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులు 4696 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఇందిరమ్మ పాలనకు నిదర్శనం అన్నారు. దశాబ్ద కాలంగా మిడ్ మానేరు పునరవాసం కింద ఇండ్లను మంజూరు చేయాలని ఎన్నో పోరాటలు, నిరసనలు గతంలో చేశామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో న్యాయం జరుగుతుందన్నారు.

Similar News

News November 1, 2025

నర్సాపూర్: ‘ఎకో పార్కు, చెరువు డంపింగ్ యార్డ్ కావద్దు’

image

నర్సాపూర్ శివారులో నిర్మించిన నూతన ఎకో పార్కు చెరువు డంపింగ్ యార్డ్ కావద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నర్సాపూర్ శివారులో నూతనంగా నిర్మించిన ఎకో పార్కును మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్‌లతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఆయా శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు.

News November 1, 2025

మెదక్: బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతలు వీరే..

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్‌లో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజేతలు వీరే. ఓపెన్‌ కేటగిరీలో డా. కార్తీక్, నాగవర్ధన్ జోడీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర 2వ స్థానంలో నిలిచారు. 40ఏళ్లు పైబడిన విభాగంలో ప్రవీణ్, అశ్విన్‌లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో వీణ, మౌనిక జోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. త్వరలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

News October 31, 2025

మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

image

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్‌లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.