News September 11, 2025

దసరాకి ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు: మంత్రి వాసంశెట్టి

image

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం రామచంద్రాపురంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా దసరా పండుగకు ఆటో డ్రైవర్లకు రూ.15,000 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ‘సీఎం అంటే కామన్ మ్యాన్’ అనేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 11, 2025

VKB: ‘పశువులకు అందుబాటులో మందులు’

image

జిల్లాలో పశువులకు ఎలాంటి వ్యాధులు ప్రబలిన మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశువైద్యాధికారి సదానందం తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో పశువుల మందులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పశువులకు ఎలాంటి వ్యాధులు సోకిన చికిత్సలు అందించి మందులు అందిస్తామన్నారు. సబ్సిడీపై 75% గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News September 11, 2025

గోదావరిఖని: ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి: CPI

image

తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని రామగుండం నగర CPI కార్యదర్శి కే.కనకరాజు పేర్కొన్నారు. గోదావరిఖని పట్టణ చౌరస్తాలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

News September 11, 2025

సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సమావేశం

image

HYDలోని INTUC కార్యాలయంలో సింగరేణి కార్మికుల సమస్యలపై యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్(RGM) ఆధ్వర్యంలో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులపై యాజమాన్యం అవలంబిస్తోన్న మొండి వైఖరిని ఎదుర్కునే విధానాలపై చర్చించారు. కార్మికులకు లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికుల బోనస్, IT మాఫీ అంశాలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.