News September 16, 2025
దసరా పండగకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలి: కలెక్టర్

బతుకమ్మ, దసరా పండుగలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా సంబరాలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ మండల ప్రత్యేక అధికారులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News September 17, 2025
ఆఫ్గనిస్థాన్పై బంగ్లాదేశ్ గెలుపు

ఆసియా కప్: ఆఫ్గనిస్థాన్పై బంగ్లాదేశ్ 8 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 20 ఓవర్లలో 154/5 పరుగులు చేసింది. తన్జిద్ 52, సైఫ్ 30, తౌహిద్ 26 రాణించారు. రషీద్, నూర్ అహ్మద్లకు చెరో 2, అజ్మతుల్లా ఒక వికెట్ తీశారు. ఆఫ్గన్ జట్టు 146 రన్స్కు ఆలౌటైంది. గుర్బాజ్ 35, అజ్మతుల్లా 30, రషిద్ 20 మినహా ఎవరూ మంచిగా రాణించలేదు. ముస్తఫిజుర్ 3, నసుమ్, తస్కిన్, రిషద్లకు తలో వికెట్ దక్కింది.
News September 17, 2025
జైపూర్: విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. జైపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు. అధికారులు తదితరులు ఉన్నారు.
News September 17, 2025
ఉద్యమాల పురిటి గడ్డ.. మెదక్ జిల్లా

నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి HYD సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో మెదక్ నుంచి ఎందరో యోధులు పాల్గొన్నారు. వారి త్యాగాల ఫలితంగా 1948 SEC 17న HYD సంస్థానం దేశంలో విలీనమైంది. 1947 AUG 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా HYD సంస్థానం దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మెదక్ నుంచి మగ్దూం మోయినోద్దీన్, కేవల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.