News September 23, 2025

దసరా సెలవుల్లో స్కూళ్లు మూసివేయాల్సిందే: డీఈవో

image

దసరా సెలవుల సందర్భంగా పాఠశాలలు తప్పనిసరిగా మూసివేయాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఆదేశించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు విధిగా అమలు చేయాలన్నారు. పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ ఆదేశాలను గౌరవించాలని కోరుతూ, ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని సూచించారు.

Similar News

News September 23, 2025

మేడారం చరిత్రలో తొలిసారి.. జాతరకు ముందే CM రాక

image

మేడారం మహాజాతర చరిత్రలో కొత్త అంశం చేరనుంది. 4 రోజులపాటు జరిగే ఈ ‘జనజాతర’కు రాష్ట్ర ముఖ్యమంత్రులు రావడం పరిపాటే. మేడారం జాతరను 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అమ్మల దగ్గరకు CMల రాక మొదలైంది. కాగా, ఇది ఆచారంగా మారి CMలందరూ జాతర టైంలో వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. కానీ, తొలిసారిగా CM రేవంత్ జాతరకు ముందే వచ్చి జాతర నిర్వహణపై సమీక్షించనున్నారు. దీంతో మేడారం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి.

News September 23, 2025

SBIలో స్పెషలిస్ట్ పోస్టులు

image

<>SBI <<>>15 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News September 23, 2025

మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా: లోకేశ్

image

AP: శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా YCP నేత బొత్సపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా? సీనియర్ నేత అయ్యుండి బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు? నన్ను డిక్టేట్ చేయడం సరికాదు’ అని ఆగ్రహించారు. తమ హయాంలో బకాయిలు పెట్టలేదని, లోకేశ్ మాటలు సరిగాలేవని బొత్స బదులిచ్చారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై YCP ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.