News September 23, 2025
దసరా సెలవుల్లో స్కూళ్లు మూసివేయాల్సిందే: డీఈవో

దసరా సెలవుల సందర్భంగా పాఠశాలలు తప్పనిసరిగా మూసివేయాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఆదేశించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు విధిగా అమలు చేయాలన్నారు. పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ ఆదేశాలను గౌరవించాలని కోరుతూ, ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని సూచించారు.
Similar News
News September 23, 2025
మేడారం చరిత్రలో తొలిసారి.. జాతరకు ముందే CM రాక

మేడారం మహాజాతర చరిత్రలో కొత్త అంశం చేరనుంది. 4 రోజులపాటు జరిగే ఈ ‘జనజాతర’కు రాష్ట్ర ముఖ్యమంత్రులు రావడం పరిపాటే. మేడారం జాతరను 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అమ్మల దగ్గరకు CMల రాక మొదలైంది. కాగా, ఇది ఆచారంగా మారి CMలందరూ జాతర టైంలో వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. కానీ, తొలిసారిగా CM రేవంత్ జాతరకు ముందే వచ్చి జాతర నిర్వహణపై సమీక్షించనున్నారు. దీంతో మేడారం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి.
News September 23, 2025
SBIలో స్పెషలిస్ట్ పోస్టులు

<
News September 23, 2025
మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా: లోకేశ్

AP: శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చ సందర్భంగా YCP నేత బొత్సపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా? సీనియర్ నేత అయ్యుండి బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు? నన్ను డిక్టేట్ చేయడం సరికాదు’ అని ఆగ్రహించారు. తమ హయాంలో బకాయిలు పెట్టలేదని, లోకేశ్ మాటలు సరిగాలేవని బొత్స బదులిచ్చారు. కాగా ఫీజు రీయింబర్స్మెంట్పై YCP ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.