News October 12, 2024
దసరా SPECIAL.. ఖమ్మంలో తమిళ దేవత..!
తమిళుల ఆరాధ్య దైవం మారియమ్మన్.. ఏళ్లుగా ఖమ్మం ప్రజల ఇలవేల్పుగా మారింది. ఇక్కడ మారెమ్మగా పూజలందుకుంటోంది. ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమ ఉండడంతో 1970లో తమిళనాడు నుంచి భారీగా కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేసేవారు. కాగా 1982లో పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతుండడంతో తమను కాపాడాలని కోరుతూ వారు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2018లో ఈ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది.
Similar News
News October 12, 2024
KMM: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
మణుగూరు – బెలగావి రైలు పునరుద్ధరణ
ఈనెల 16వతేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మణుగూరు – బెలగావి రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలును దాదాపు 5 నెలల 15 రోజులు మాత్రమే తాత్కాలికంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ రైలును మణుగూరు నుంచి బెలగావి వరకు శాశ్వతంగా నడపాలని, అలాగే డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్యలో గల అన్ని స్టేషన్లలో ఆపాలని ప్రజలు కోరుతున్నారు.
News October 11, 2024
సిరిపురం దేశాన్ని ఆకర్షిస్తుంది: డిప్యూటీ సీఎం
సోలార్ విద్యుత్ పనులు పూర్తైన తర్వాత సిరిపురం గ్రామం దేశాన్ని ఆకర్షిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో వ్యవసాయ పంపు సెట్లకు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమైందో చూసేందుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి మంత్రులు వస్తారని చెప్పారు.