News October 12, 2024
దసరా SPECIAL.. ఖమ్మంలో తమిళ దేవత..!

తమిళుల ఆరాధ్య దైవం మారియమ్మన్.. ఏళ్లుగా ఖమ్మం ప్రజల ఇలవేల్పుగా మారింది. ఇక్కడ మారెమ్మగా పూజలందుకుంటోంది. ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమ ఉండడంతో 1970లో తమిళనాడు నుంచి భారీగా కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేసేవారు. కాగా 1982లో పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతుండడంతో తమను కాపాడాలని కోరుతూ వారు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2018లో ఈ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది.
Similar News
News October 18, 2025
ఖమ్మం కలెక్టర్ను కలిసిన స.హ.చ కమిషనర్

ఖమ్మం కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ అనుదీప్ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, చట్టం నిబంధనలు 4(1)(బి), 6(1) లపై పౌర సమాచార అధికారులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం మార్గం తదితర అంశాలపై కమిషనర్.. కలెక్టర్తో చర్చించారు.
News October 18, 2025
ఖమ్మం: బందోబస్త్ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ శనివారం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీంచారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
News October 18, 2025
రోగులపై సేవా భావాన్ని కలిగి ఉండాలి: ఖమ్మం కలెక్టర్

వైద్య వృత్తి పవిత్రమైందని, రోగుల పట్ల సేవా భావాన్ని వైద్యులు కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం కలెక్టర్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన 2025-వైట్ కోట్ సెర్మనిలో పాల్గొన్నారు. వైద్య వృత్తి ఎన్నుకున్న విద్యార్థులు అకాడమిక్స్లో పట్టు సాధించడంతో పాటు మానవ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలని, మన దగ్గర వచ్చే రోగులకు పేద, ధనిక భేదం లేకుండా వారికి చికిత్స అందించాలన్నారు.