News February 6, 2025

దస్తగిరి రెడ్డి ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

image

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ జైలులో ఇబ్బంది పెట్టారని వైఎస్ వివేకానంద హత్య కేసులో అప్రూవర్‌ మారిన దస్తగిరి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డాక్టర్ చైతన్య రెడ్డి తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు. రేపు ఉదయం కడప జైలులో దస్తగిరి రెడ్డితో పాడు వారిద్దరినీ విచారణ అధికారి రాహుల్ ప్రశ్నించనున్నారు.

Similar News

News February 6, 2025

కడప: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు

image

బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని చౌదరి వారి పల్లి గ్రామంలో 25 మంది రైతులు నకిలీ వరి విత్తనాలతో మోసపోయారు. ఖాజీపేట మండలంలోని ఓ దుకాణంలో గత నెలలో వరి విత్తనాలు కొనుగోలు చేసి వరి పైరు సాగు చేశారు. 25 రోజులకే వరిలో వెన్ను రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నకిలీ విత్తనాల వల్లనే వరి పైరు ఇలా ముందే వెన్నుదశలోకి వెళ్లిందని బాధిత రైతులు గురివి రెడ్డి, పెద్ద వీరారెడ్డి వాపోయారు.

News February 6, 2025

కడప: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహ్యతకు పాల్పడిన ఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు సీఐ లింగప్ప తెలిపిన వివరాల మేరకు.. గూడెంచెరువు గ్రామానికి చెందిన చెన్నప్ప, వరలక్ష్మి దంపతులు. సంక్రాంతి పండగకు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ(M) పాలెం గ్రామానికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదు. కాగా బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెన్నప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News February 6, 2025

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

image

జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసుపై వారానికి ఒకసారి సమీక్ష చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. పోలీసులు వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలన్నారు.

error: Content is protected !!