News July 1, 2024
దస్తురాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి

బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎంబడి లావణ్య, మల్లేశ్ దంపతుల చిన్న కుమారుడు రాజ్ కుమార్ (13) సోమవారం ఇంటి అవసరాల కోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీరు తీసుకువచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ శంకర్ తెలిపారు.
Similar News
News February 20, 2026
ఆదిలాబాద్: ఈనెల 24న జాబ్ మేళా

ఆదిలాబాద జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35 లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News February 20, 2026
ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
News February 19, 2026
ADB: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC సంక్షేమ శాఖ అధికారిణి సునీత కుమారి పేర్కొన్నారు. ఈ – పాస్ ఆన్ లైన్లో మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


