News May 25, 2024

దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి: చంద్రబాబు

image

ఎన్నికల్లో ఓటమి ఖాయమవ్వడంతో విచక్షణ కోల్పోయిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం, 89పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు.. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శేషాద్రి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

Similar News

News November 8, 2025

కనకదాసు చిత్ర పటానికి SP నివాళి

image

భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ శనివారం నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించి విశిష్టమైన కవిగా, తత్వవేత్తగా, సమానత్వానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం కుల, మత తేడాలను చెరిపివేసేలా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్ బాషా, 1 టౌన్ సీఐ మహేశ్వర పాల్గొన్నారు.

News November 7, 2025

కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల స్థాపన ఇక్కడే.!

image

☞ కుప్పం (M) పలార్లపల్లి వద్ద అలీఫ్ ☞ అనిమిగానిపల్లి సమీపంలో ఆదిత్య బిర్లా
☞శాంతిపురం (M) తంబిగానిపల్లి వద్ద మదర్ డెయిరీ ☞ రామకుప్పం(M) విజిలాపురం వద్ద ఈరైస్
☞గుడిపల్లి (M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ACE, శ్రీజ డెయిరీ, SVF సోయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
☞ మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటు
☞ 8న వర్చువల్‌గా CM చంద్రబాబు శంకుస్థాపన.

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.