News March 21, 2025

దాడి కేసులో ఇద్దరికి రిమాండ్: వాంకిడి ఎస్సై

image

వాంకిడి మండలంలోని ఓ బిర్యాణి హోటల్ యజమానిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..ఈ నెల 18న వాంకిడిలోని ఓ బిర్యానీ హోటల్లో రవిచంద్ర కాలనీకి చెందిన కొండ సంతోష్, పస్తం ఇషాక్ మద్యం మత్తులో బిర్యానీ తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ యజమానితో గొడవకు దిగి దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 21, 2025

గోదావరిఖని: ప్రాణం తీసిన బెట్టింగ్..

image

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న కొరవీణ సాయితేజ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది రెండురోజుల క్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

News March 21, 2025

సిరిసిల్ల: పదోతరగతి పరీక్షలకు 99.8శాతం విద్యార్థుల హాజరు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 99.8% విద్యార్థులు హాజరైనట్లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని (35) పరీక్షా కేంద్రాల్లో (6766) మంది విద్యార్థులకు (99.8%) హాజరుశాతంతో (6752) మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. (14) మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు పరీక్ష సజావుగా సాగిందని కలెక్టర్ తెలిపారు.

News March 21, 2025

IPLలోకి ఎంట్రీ ఇస్తోన్న కేన్ మామ

image

ఐపీఎల్ 2025లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఓపెనింగ్ గేమ్ ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచుకు ఆయన ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరించనున్నారు. కాగా మెగా వేలంలో విలియమ్సన్‌ అన్‌సోల్డ్‌గా మిగిలారు. రూ.2 కోట్ల కనీస ధరతో ఆయనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. మరోవైపు PSL డ్రాఫ్ట్‌లోనూ కేన్ మామను ఎవరూ పట్టించుకోలేదు.

error: Content is protected !!