News February 28, 2025
దామరగిద్ద: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

దామరగిద్దకు చెందిన మైనర్ బాలికను ప్రేమపేరుతో శారీరకంగా అనుభవించి, వేధించిన పిడెంపల్లి గ్రామానికి చెందిన నరేశ్కి 20 ఏళ్ల జైలు శిక్ష తోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2021 మార్చ్ 30న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, జడ్జి తీర్పు వెల్లడించారని చెప్పారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం: ఓటు వేసి వస్తూ గుండెపోటుతో మృతి

సత్తుపల్లి మండలం బేతుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని ఇంటికి వెళ్తున్న నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News December 17, 2025
సిరిసిల్లలో 11 గంటల వరకు 46.80 శాతం పోలింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో 47.30 శాతం, వీర్నపల్లి 56.17, ముస్తాబాద్ 41.57 శాతం, గంభీరావుపేట 48.84 శాతం పోలింగ్ నమోదయింది. 1,25,324 మంది ఓటర్లకు గాను 58,653 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 46.80 శాతం పోలింగ్ నమోదయింది.
News December 17, 2025
ఫ్రిజ్ లేకపోయినా కూరగాయలు ఇలా ఫ్రెష్..

ఫ్రిజ్ లేకపోయినా కూరగాయలు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. * క్యారెట్లను అల్యూమినియం ఫాయిల్ తో చుట్టి, పైన, కింద తెరిచి ఉంచాలి. * కరివేపాకును ఎయిర్టైట్ డబ్బాలో పెట్టాలి. * గిన్నెలో నీళ్లు నింపి క్యాబేజీ అడుగు మునిగేలా ఉంచాలి. * టమాటాలు కాస్త గట్టివి తీసుకుంటే ఎప్పటికప్పుడు పండినవి వాడుకోవచ్చు. * కొనేటప్పుడే చూసుకొని ఎండినట్లు, వాడినవి తీసుకోకూడదు. ఇంట్లో ఎండ, వేడి తగలనిచోట కూరగాయలు ఉంచాలి.


