News March 21, 2025

దామరగిద్ద: రోగులకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్ 

image

ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం ఉంచి ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను, పరిశీలించారు. వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.

Similar News

News November 4, 2025

ములుగు జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు

image

జిల్లాలో 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర్ టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల్లో 1,318 టార్పాలిన్ కవర్లు, 56 తూర్పార యంత్రాలు, 87 తూకం యంత్రాలతో పాటు 1,28,750 గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇప్పటివరకు ఆరుగురు రైతుల నుంచి ₹6,83,254 విలువ గల 28.600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 4, 2025

TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

image

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.

News November 4, 2025

ADB: పత్తి రైతుకు మరో కష్టం

image

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఓవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాళు కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనేవారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 క్వింటాళు కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ADBలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.