News October 9, 2025

దామోదర్ రెడ్డి మృతిపై రాహుల్ గాంధీ సంతాపం

image

సూర్యాపేట: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన లేఖ ముఖంగా దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి దామన్న చేసిన సేవలను స్మరించుకున్నారు.

Similar News

News October 9, 2025

NRML: 9 జడ్పీటీసీ, 75 ఎంపీటీసీలకు నేటి నుంచి నామినేషన్లు

image

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి ఎల్లుండి (అక్టోబర్ 11, 2025) వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలివిడతలో 9 జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్, మామడ, లక్ష్మణచందా, నిర్మల్, సోన్, సారంగాపూర్ మండలాల్లో పోలింగ్ జరగనుంది.

News October 9, 2025

గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ తేదీని చెక్ చేయండిలా!

image

ఇంట్లో నెలల తరబడి గ్యాస్ సిలిండర్ ఉంచుతున్నారా? ఇది ప్రమాదమే. ఎందుకంటే వాటికీ ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. సురక్షితమైన వాడకం కోసం దీనిని నిర్ణయించారు. దీనిని సిలిండర్ పైభాగంలో ముద్రిస్తారు. ఉదా.. ‘C-27’ అని ఉంటే 2027లో JUL- SEP మధ్య ముగుస్తుందని అర్థం. A అని ఉంటే JAN TO MAR, B- APR TO JUN, C-JULY TO SEP, D- OCT TO DEC అని తెలుసుకోవాలి. గడువైపోయిన వాటిని వాడకుండా ఉంటే ప్రమాదాలు జరగవు. SHARE IT

News October 9, 2025

గ్రూప్1 నియామకాలపై జోక్యానికి సుప్రీం నో

image

తెలంగాణలో గ్రూప్1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఇదే అంశంపై ఈనెల 15న హైకోర్టులో విచారణ ఉన్న సమయంలో తాము ఇందులో జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. కాగా హైకోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేసింది.