News April 1, 2026

దారపు రీల్స్‌తో రామ మందిరం!

image

పనికిరాని వస్తువులతో అద్భుత కళాఖండాలను సృష్టించవచ్చని వెలుగుబందకు చెందిన ఉపాధ్యాయుడు భాస్కట పవన్ కుమార్ నిరూపించారు. శ్రీరామనవమి సందర్భంగా దారపు రీల్స్, వాడేసిన అట్టలతో ‘అయోధ్య రామ మందిరం’ నమూనాను అందంగా తయారు చేశారు. బుధవారం ఈ నమూనాను చూసిన తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. ‘రీయూస్’ నినాదంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Similar News

News April 5, 2026

దండంగి కొండలపై పులి సంచారం

image

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

News April 5, 2026

ఏప్రిల్ 6న యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6న యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 5, 2026

ఏప్రిల్ 6న యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6న యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.