News December 10, 2025

దారిద్ర్యాన్ని తొలగించే గణపతి స్తోత్రం

image

సకల కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని మనం విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేస్తుంటాం. అలాగే ‘సువర్ణ వర్ణ సుందరం’ అంటూ మొదలయ్యే ‘దారిద్ర్య దహన గణపతి స్తోత్రం’ పఠిస్తే దారిద్ర్యం తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడి అనుగ్రహం కోసం భక్తి, శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని తప్పక పఠించాలని సూచిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు, ఎలా పఠించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

Similar News

News April 14, 2026

3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

image

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్‌ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.

News April 14, 2026

IPL: CSKతో మ్యాచ్.. KKR బోణీ కొడుతుందా?

image

IPLలో భాగంగా ఇవాళ చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, ఆడిన 3 మ్యాచుల్లోనూ KKR ఓడింది. దీంతో ఇవాళ్టి మ్యాచులో గెలవాలని భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై టచ్‌లోకి వచ్చింది. అదే ఊపుతో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News April 14, 2026

దేశంలోనే తొలి ‘క్వాంటం’ కేంద్రం.. అమరావతిలో నేడే ప్రారంభం

image

AP: దేశంలోనే తొలి క్వాంటం కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది. అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్(AQRS)ను CM చంద్రబాబు ఇవాళ 2PMకు ప్రారంభించనున్నారు. అమరావతిలోని SRM వర్సిటీలో ఓ ఫెసిలిటీ(1 S), గన్నవరంలోని మేథ టవర్స్‌‌లో మరొకటి(1 Q) ఆవిష్కృతం కానున్నాయి. దీంతో <<19081669>>క్వాంటం కంప్యూటర్<<>> హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం క్వాంటం వ్యాలీకి రానుంది.