News December 15, 2025

దారుణం.. అదనపు కట్నం కోసం కోడలి హత్య!

image

TG: అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్(D) కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. స్వప్న, రామన్న 15 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ₹3L కట్నం, 8 తులాల బంగారం, తర్వాత ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు. తాజాగా ఆమెను కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగుమందు పోసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News December 22, 2025

ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

image

MGNREGA స్థానంలో కేంద్రం కొత్తగా తెచ్చిన VB-G RAM G చట్టంతో రైతులకు ఊరట దక్కనుంది. ఈ చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పీక్ అగ్రికల్చర్ సీజన్ (పంటలు వేసే, కోసే)లో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేసే వెసులుబాటు ఉంది. దీనివల్ల రైతులకు కూలీల కొరత నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు ఉపాధి హామీ పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరగడంతో కూలీల ఆదాయం 25% పెరగనుంది.

News December 22, 2025

27న మండల పూజ.. ఆ రోజుల్లో శబరిమల ఆలయం మూసివేత

image

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ నిర్వహించనున్నారు. ఉదయం 10.10AM నుంచి 11.30AM వరకు కొనసాగనుంది. ‘26న 6.30PMకు పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరుకుంటాయి. స్వామిని అలంకరించి దీపారాధన నిర్వహిస్తాం. 27న రాత్రి 11 గంటలకు హరివరాసనం అనంతరం ఆలయం మూసివేస్తాం. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న 5PMకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.

News December 22, 2025

అమ్మాయికి ఈ టెస్టులు చేయించండి..

image

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారి ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్, థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్‌ టెస్ట్‌, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.