News January 20, 2026
దావోస్లో సీఎం టీమ్.. టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్

TG CM రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన బృందం దావోస్లో పెట్టుబడుల వేట మొదలుపెట్టింది. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీని వరల్డ్ క్లాస్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు UAE ప్రభుత్వంతో చేతులు కలిపింది. అటు ఇజ్రాయెల్కు చెందిన స్టార్టప్ కంపెనీలు రాష్ట్రంలో ఏఐ సంబంధిత పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకరించాయి.
Similar News
News April 13, 2026
పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.
News April 13, 2026
బ్రహ్మ చేసిన పొరపాటు ఏంటి?

ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ అందులోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి అతడిని పిసినారిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం.<<-se>>#PADHYAM<<>>
News April 13, 2026
త్వరలో హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు!

TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. కొన్ని నిమిషాల్లోనే 130 రకాల ఆరోగ్య పరీక్షలు చేసే మెషీన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే హైదరాబాద్లో 2 ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన యంత్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. BP, ECG, BMI, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షనింగ్, థైరాయిడ్ తదితర టెస్టులు వీటితో చేసుకోవచ్చు.


