News December 2, 2025
దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

దిత్వా తుఫాన్ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.
Similar News
News December 3, 2025
APPLY NOW: IIIT వడోదరలో ఉద్యోగాలు

IIIT వడోదర 7 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ట్రైనింగ్& ప్లేస్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్సైట్: iiitvadodara.ac.in
News December 3, 2025
ఈ నెల 6 నుంచి లోకేశ్ విదేశీ పర్యటన

AP: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు అమెరికాలో, 11-12 తేదీల్లో కెనడాలో పర్యటిస్తారు. తొలి రోజు డల్లాస్లో ప్రవాసులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్లో ప్రముఖ సంస్థల CEOలతో ‘బిజినెస్ టు బిజినెస్’ సమావేశాలు నిర్వహిస్తారు. కెనడాలో మాన్యుఫాక్చరింగ్ సంస్థలతో చర్చలు జరపనున్నారు.
News December 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 85

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


