News February 8, 2025

దిలావర్పూర్: ఆయిల్ ఫామ్‌తో రైతులకు లాభసాటి

image

ఆయిల్ ఫామ్ మొక్కలను నాటుకోవడంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వి. రమణ అన్నారు. దిలావర్పూర్ మండలంలో ఆయా రైతులు నాటిన తోటలను సందర్శించారు. అనంతరం రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలపై రాయితీ వివరాలు తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను పేర్కొన్నారు. ఇందులో డివిజన్ మేనేజర్ శేఖర్, క్లస్టర్ ఆఫీసర్ ప్రశాంత్, రైతులు ఉన్నారు. 

Similar News

News February 8, 2025

ఢిల్లీ దంగల్‌లో విజేత ఎవరు? నేడే కౌంటింగ్

image

దేశమంతా ఆసక్తి ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉ.7గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా, ఏ పార్టీది గెలుపనేది మ.12కు క్లారిటీ రానుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద EC పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ప్రతి అప్‌డేట్‌ను WAY2NEWS మీకు ఎక్స్‌క్లూజివ్‌గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్‌లో చూడవచ్చు.

News February 8, 2025

బుగ్గారం: ట్రాక్టర్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

image

ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో దంపతులు తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన అక్కల సునీత, శేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 8, 2025

ఉదయం లేవగానే రీల్స్ చూస్తున్నారా?

image

ఉదయం లేవగానే మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తే కార్టిసాల్ హార్మోన్ పీక్స్‌కి వెళ్లిపోయి రోజంతా స్ట్రెస్‌ ఫీలవుతారని డాక్టర్లు చెబుతున్నారు. దానికి బదులు సూర్యరశ్మి పడే ప్రదేశంలో కాసేపు నిల్చొని డే స్టార్ట్ చేస్తే చికాకు, స్ట్రెస్ దూరమవుతుందని అంటున్నారు. సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి రాగానే టీవీలో గొడవలు పడే న్యూస్ చూసేబదులు పిల్లలు, కుటుంబంతో సరదాగా మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.

error: Content is protected !!