News April 16, 2025
దిలావర్పూర్: జీవనోపాధికి వచ్చి మృత్యుఒడికి చేరి

దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు MHలోని హిమాయత్నగర్ తాలుక దబ్దారికి చెందిన వ్యక్తి. 4 నెలల కిందట కుటుంబంతో బతుకుదెరువు కోసం సముందర్పల్లిలోని ఇటుక బట్టీల్లో కార్మికులుగా చేరారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో రాజు మృతి చెందగా.. కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. రాజు భార్య లక్ష్మిబాయి, కూతురు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు.
Similar News
News April 16, 2025
IPL: నేడు ఢిల్లీ, రాజస్థాన్ ఢీ

IPLలో ఇవాళ DC, RR తలపడనున్నాయి. ఈ రెండింటి మధ్య లీగ్లో 29 మ్యాచులు జరగ్గా, 15(RR)-14(DC) విజయాలు దక్కించుకున్నాయి. రాజస్థాన్కు పరాగ్ ఫామ్ కలవరపెడుతుండగా కెప్టెన్ శాంసన్పైనే భారం పడుతోంది. మరోవైపు ఢిల్లీ ఓపెనర్ మెక్గుర్క్ పేలవ ప్రదర్శన వారిని ఇబ్బంది పెడుతుండగా, కరుణ్ నాయర్ మొన్నటి నాక్తో బ్యాటింగ్ లైనప్ను పటిష్ఠం చేశారు. ఢిల్లీ పిచ్ కాబట్టి ఇవాళ హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశం ఉంది.
News April 16, 2025
భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది అవకాశం

TG: రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భూభారతి’ భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారులు ఇవ్వనుంది.
ఫీజుల వివరాలు..
మ్యుటేషన్/సక్సెషన్: ఎకరానికి రూ.2,500
పట్టాదార్ పాస్ బుక్: రూ.300, సర్టిఫైడ్ కాపీ: రూ.10
రికార్డ్ సవరణ/ అప్పీళ్లు: రూ.1,000
స్లాట్ రీషెడ్యూల్: తొలిసారి ఫ్రీ, రెండోసారి రూ.500
News April 16, 2025
జగిత్యాల: భూభారతితో భూ రికార్డుల ప్రక్షాళన: కలెక్టర్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ భారతి పోర్టల్పై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో RDOలు, MROలు పాల్గొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, డిజిటలైజేషన్, హక్కుల కల్పనపై చర్చించారు. ప్రజలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను కోరారు. సర్వే పనులు నిష్పాక్షికంగా చేయాలన్నారు. భూ భారతి భవిష్యత్ తరాలకు దోహదపడే కార్యక్రమమని పేర్కొన్నారు.