News September 23, 2025

దిలావర్పూర్: మాతాన్నపూర్ణ దేవిగా పార్వతీదేవి

image

దిలావర్పూర్ మండలం కదిలి మాత అన్నపూర్ణేశ్వరి ఆలయానికి విశిష్ఠ చరిత్ర ఉంది. పార్వతీదేవి శివుడితో కలిసి ఈ స్థలంలో మాత అన్నపూర్ణేశ్వరిగా కొలువై ఉంది. దక్షిణం వైపు ముఖం కలిగి అమ్మవారు కొలువయ్యారు. అందుకే ఇక్కడ ఏడాది పొడుగునా అన్నదానం నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో ఇక్కడ హోమాలు, పూజలు చేయడంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు దర్శించుకుంటారు. 9 రోజులు నిష్ఠతో పూజలు ఆచరిస్తారు.

Similar News

News September 23, 2025

ఖానాపూర్: గోదావరికి పోటెత్తిన వరద

image

ఎస్సారెస్పీకి వచ్చిన వరదను దిగువకు వదలడంతో ఖానాపూర్, కడెం, మామడ మండలాల పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు నదివైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

News September 23, 2025

పెంబి: జేపీఎస్‌లకు ఈగోస

image

మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో పెంబి మండలంలో పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్‌లు) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వారు చెట్లు, పుట్టలు, ఇళ్లపైకి ఎక్కి ఫోటోలు తీయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి తక్షణమే సిగ్నల్స్ రూటర్లు ఏర్పాటు చేయాలని జేపీఎస్‌లు కోరుతున్నారు.

News September 23, 2025

జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

image

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.