News September 13, 2025

దిల్‌సుఖ్‌నగర్: ఆర్టీసీ ‘యాత్రాదానం’

image

టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని హైదరాబాద్-2 డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్రలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 11, 2026

పురపోరుకు రంగారెడ్డి జిల్లా సిద్ధం

image

రంగారెడ్డి జిల్లాలో పుర పోరుకు సిద్ధమైంది. ఉ.7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై.. సా.5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 437 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 126 మంది, బీఆర్ఎస్ నుంచి 122, బీజేపీ నుంచి 109 మందితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 57 మంది ఉన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్ క్యారీ చేయండి.

News February 10, 2026

రేపే మున్సిపల్ ఎన్నికలు.. సర్వం సిద్ధం

image

మున్సిపల్ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 126 వార్డుల్లో 437 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,76,023మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని మంగళవారం కేంద్రాలకు ఆయా తరలించారు.

News February 10, 2026

HYD: 1,926 సమస్యాత్మక ప్రాంతాలు: DGP

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. 1,926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామని, 167 సర్వైలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.