News April 2, 2025

దివావకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన సాగేదిలా

image

పెదచెర్లపల్లి మండలం దివాకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 7:15 నిమిషాలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. 9:15కు దివాకరపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9: 25 నిమిషాలకు బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45 వరకు సభలో పాల్గొంటారు. 11:55 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు.

Similar News

News April 3, 2025

ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సబ్జెక్టు వారిగా సాధారణ సీనియార్టీ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే ఈనెల 9వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.

News April 2, 2025

ప్రకాశం: రేపటి నుంచి పది మూల్యాంకనం ప్రారంభం

image

ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ హైస్కూలులో పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 3 నుంచి 9వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్‌ తెలిపారు. పరీక్షల మూల్యాంకనానికి 150 గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 150 మంది చీఫ్‌ ఎగ్జామినర్స్‌, 600 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్‌, 300 మంది స్పెషల్‌ అసిస్టెంట్స్‌ను తీసుకున్నామన్నారు. జిల్లాకు మొత్తం 1,90,000 పేపర్లు కేటాయించినట్లు తెలిపారు.

News April 2, 2025

పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్లాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వంశీ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!