News December 10, 2025
దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే టిడ్కో ఇళ్లు: కలెక్టర్

జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు టిడ్కో ఇళ్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే మంజూరయ్యేలా చూస్తామని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఎవరికీ మంజూరు చేయని ఇళ్లలో వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడిన ఆమె.. క్రీడల్లో రాణించిన వారికి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News December 11, 2025
ఐవీఆర్ఎస్లో జిల్లా ర్యాంకు మెరుగుపరుస్తాం: VZM JC

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలో విజయనగరం జిల్లాకి మరింత మంచి ర్యాంకు సాధించేలా చర్యలు తీసుకుంటామని JC సేధు మాధవన్ తెలిపారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిస్థితిని వివిధ అంశాలపై జేసీ వివరించారు. రేషన్ సరకుల పంపిణీ నిర్ణీత సమయానికి పకడ్బందీగా జరుగుతోందని, ధాన్యం సేకరణ కూడా సజావుగా కొనసాగుతుందని చెప్పారు.
News December 11, 2025
రైతులకు గుడ్ న్యూస్.. రేపు ఖాతాల్లోకి డబ్బులు

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాలను రేపట్నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 55,904 మంది రైతుల అకౌంట్లలో ₹585 కోట్లు జమ అవుతాయన్నారు. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు చెప్పారు. కేంద్రం సహకరించకున్నా రైతులు నష్టపోరాదని తామే సేకరిస్తున్నట్లు వివరించారు. రైతుల శ్రేయస్సే తమ తొలి ప్రాధాన్యమన్నారు.
News December 11, 2025
VZM: జిల్లా గ్రంథలయ సంస్థ ఛైర్మన్గా రామకృష్ణ

విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా టీడీపీ నేత డొక్కాడ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చెందిన రామకృష్ణ గతంలో ఏఎంసీ ఛైర్మన్గా ఆయన భార్య మంగమ్మ గుమ్మలక్ష్మిపురం జడ్పీటీసీగా పనిచేశారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా నియమితులైన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.


