News April 13, 2025

దుగ్గిరాల: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్ 

image

దుగ్గిరాల (M) చినపాలెంలో శనివారం జరిగిన విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది. ఓ జూనియర్ కాలేజీలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న అవినాశ్ (17) ఇంటర్ పరీక్షల్లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఫలితాలు వెలువడిన వెంటనే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అవినాశ్‌ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.  

Similar News

News April 15, 2025

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు: సుధేష్ణ సేన్

image

గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్ గుంటూరు-నంద్యాల సెక్షన్‌లో స్టేషన్లను మొదటిసారిగా సోమవారం తనిఖీ చేశారు. ప్రత్యేకంగా రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. అమృత భారత స్టేషను పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సాతులూరు, నరసరావుపేట, దొనకొండ మార్కాపురం, నంద్యాల స్టేషన్లను డీఆర్ఎం విస్తృతంగా తనిఖీ చేశారు.

News April 14, 2025

CSK ఓపెనర్‌గా గుంటూరు కుర్రోడు

image

ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై తరఫున ఈరోజు ఆరంగేట్రం చేసిన గుంటూరు కుర్రోడు షేక్ రషీద్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా వచ్చి 19 బంతుల్లో 27(6 ఫోర్లు) పరుగులు చేశారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్ చేతికి చిక్కి అవుటయ్యారు. రూ.30లక్షలకు రషీద్‌ను చెన్నై సొంతంగా చేసుకోగా.. ఈ సీజన్‌లో అతనికిదే మొదటి మ్యాచ్.

News April 14, 2025

ఏప్రిల్ 16న గుంటూరులో మిర్చి రైతుల నిరసన

image

పేరేచర్లలో మిర్చి సాగు చేసిన కౌలు రైతులు దిగుబడి తక్కువగా రావడంతో అధిక నష్టాలు భరిస్తున్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు ప్రక్రియ లేదు. రైతులు బోనస్ ఇవ్వాలని, రూ.15,000కి క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న గుంటూరులో నిరసన నిర్వహించనున్నారు.

error: Content is protected !!