News January 24, 2026

దుబ్బాకలో తల్లి మృతి తట్టుకోలేక కొడుకు సూసైడ్

image

దుబ్బాక పట్టణంలో ఎండీ అజారుద్దీన్ (28) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం తల్లి మహబూబ్ బీ చెరువులో దూకి మృతి చెందడంతో అప్పటి నుంచి అజారుద్దీన్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన అతడు గురువారం అర్ధరాత్రి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై కీర్తిరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 11, 2026

సైబరాబాద్ కమిషనర్ సృజన నేపథ్యమిదే..!

image

గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్‌గా IAS సృజన నేడు బాధ్యతలు స్వీకరించారు. 2013 TG క్యాడర్‌కు చెందిన ఈమె గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా, ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా, NTR జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఈమె పరిధిలోకి వస్తాయి.

News February 11, 2026

NZB: 11 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11 గంటల వరకు ఓవరాల్‌గా 22.54 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌ లో 18.94శాతం, BDNలో 32.35%, ARMRలో 29.60%, BMGL మున్సిపాలిటీలో 31.09% పోలింగ్ నమోదైంది. జిల్లాలో 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,11, 681మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

News February 11, 2026

సైబరాబాద్ కమిషనర్ సృజన నేపథ్యమిదే..!

image

గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్‌గా IAS సృజన నేడు బాధ్యతలు స్వీకరించారు. 2013 TG క్యాడర్‌కు చెందిన ఈమె గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా, ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా, NTR జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఈమె పరిధిలోకి వస్తాయి.