News February 14, 2026
దుబ్బాకలో 22 ఏళ్ల కౌన్సిలర్

దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. మల్లయ్యపల్లి(1వ వార్డు) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన 22 ఏళ్ల కోటగళ్ల రమ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలువ రజితపై 241 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అతి చిన్న వయసులోనే కౌన్సిలర్గా ఎన్నికై రికార్డు సృష్టించిన రమ్యను పలువురు అభినందిస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె తెలిపారు.
Similar News
News February 15, 2026
తిరుపతి: రైలు నుంచి కింద పడి వ్యక్తి దుర్మరణం

నందలూరు–హస్తవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు రేణిగుంట GRP పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, రైలు నుంచి జారిపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు మెరూన్ స్వెటర్, బూడిద చొక్కా, లుంగీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News February 15, 2026
ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో ఈ నెల 17వ తేదీ రింగ్ ఆఫ్ ఫైర్గా పిలిచే వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. 3.26pm-7.57pm వరకు గ్రహణం ఉంటుంది. అయితే భారతదేశం నుంచి దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటార్కిటికా ఖండం నుంచి స్పష్టంగా కన్పిస్తుంది. సాధారణంగా సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ టైమ్లో చంద్రుడు సైజు చిన్నగా కనిపించడంతో సూర్యుడి అంచులు రింగ్లా దర్శనమిస్తాయి.
News February 15, 2026
గుంటూరు జిల్లా ప్రజలకు కీలక సూచన

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేశారు. మహాశివరాత్రి బందోబస్తు విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారులందరూ ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


